పేదల పెన్నిధి, ఆత్మ బంధువు చంద్రబాబు 

* ఎన్ని కష్టాలున్నా పేదలకు ఒకటో తేదీనే పెన్షన్
* ఒకే ఇంట్లో ఇద్దరు దివ్యాగులకు కలిపి రూ.21 వేలు
* గతంలో పెన్షన్ కోసం మండుటెండలో తిప్పారని ఆగ్రహం
* సచివాలయ సిబ్బందితో గంటల వ్యవధిలోనే పూర్తి చేశాం
* మచిలీపట్నంలో పెన్షన్ పంపిణీలో మంత్రి కొల్లు రవీంద్ర  

మచిలీపట్నం, మహానాడు :  పేదల పెన్నిధి, ఆత్మ బంధువు నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు  ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని చిన్నాపురం, 49వ డివిజన్ పరిధిలోని నారాయణపురంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…

టీడీపీతోనే పెన్షన్ ప్రారంభం

తెలుగుదేశం ప్రభుత్వంతోనే పెన్షన్లు ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు. తొలుత అన్న ఎన్టీఆర్ రూ.30తో పెన్షన్ ప్రారంభించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రూ.75 చేశారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పదేళ్లలో రూ.200 చేస్తే.. చంద్రబాబు ఐదేళ్లలో ఏకంగా రూ.2000కు పెంచారు. రూ.3000 ఇస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి విడతల వారీ పెంపు అంటూ దగా చేసి పెన్షన్ దారులకు పంగనామం పెట్టాడని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒకేసారి రూ.4000 పెన్షన్ చేశారని, గత నెలలో బకాయి సొమ్ముతో కలిపి రూ.7000 ఇచ్చారన్నారు. పేదల కష్టాలు, వారి ఇబ్బందులు తెలిసిన వారు కాబట్టే వారికి మేలు చేయడం గురించి ఆలోచిస్తున్నారని తెలిపారు. జగన్ రెడ్డి భజన చేసుకోవడం తప్ప రాష్ట్ర అభివృద్ధికి గానీ, పేదల జీవితాల్లో మార్పుల కోసం గానీ కనీసం ఆలోచన చేసిన పాపాన కూడా పోలేదన్నారు.

మరోవైపు ఎన్నికల సమయంలో పెన్షన్ల పేరుతో రాజకీయం చేసి దాదాపు 30 మంది ప్రాణాలు తీశారు. సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ల పంపిణీ సాధ్యం కాదని రాద్దాంతం చేశారు. కానీ, ఇప్పుడు అదే సచివాలయ సిబ్బందితో తొలి రోజునే 90శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశాం. ఇది పాలకుడికి నేరస్తుడికి ఉన్న తేడా అన్నారు. ప్రజల కోసం ఆలోచించేవారికి, రాజకీయాలు చేయాలనుకునే వారికి తేడా ప్రజలు గమనించాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

చిన్నాపురంలో 100% అంగవైకల్యంతో బాధపడుతున్న బోదాల సునీతకు రూ.15వేలు, మరో కుటుంబ సభ్యుడికి రూ.6 వేలు కలిపి రూ.21 వేలు అందించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి పూర్తి వైకల్యంతో మంచానికే పరిమితమైన లబ్దిదారుడిని అక్కున చేర్చుకుని రూ.15 వేల పెన్షన్ అందించారు. కష్టబడి చదువుకున్నప్పటికీ రోడ్డు ప్రమాదం మంచాన పడేసిందని ఆవేదన వ్యక్తం చేయగా ఓదార్చి దైర్యం చెప్పారు. చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.

చేనేత కార్మికులకు 50 సంవత్సరాలకే పెన్షన్ ప్రారంభించిందే తెలుగుదేశం అని వివరించి.. వారికి రూ.3వేల పెన్షన్ అందించారు. సొసైటీలు మూతబడడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని తెలుపగా, సమస్యల పరిష్కరించేలా అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ప్రజల గురించి, వారి జీవితాల్లో వెలుగులు నింపడం గురించి ఆలోచించే వాడే అసలైన నాయకుడవుతాడన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా.. పెన్షన్ల విషయంలో మరో ఆలోచనకు తావివ్వకుండా ముందుకు వెళ్తున్నామన్నారు.

కార్యక్రమంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ  వేదవ్యాస్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, సర్పంచ్ కాగిత గోపాలరావు తదితరులు పాల్గొన్నారు