బాబుకు తప్పిన పెను ప్రమాదం

-రైల్వే ట్రాక్ ఎక్కిన బాబు
-అంతలోనే దూసుకు వచ్చిన రైలు
-బాబును అప్రమత్తం చేసిన సెక్యూరిటీ
-ఎర్రజెండా ఊపిన ట్రాక్‌మెన్
-వరద పరిశీలనలో బాబుకు తప్పిన ప్రమాదం
-ఊపిరిపీల్చుకున్న నేతలు, అధికారులు

విజయవాడ: వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబునాయుడుకు పెను ప్రమాదం తప్పింది. గురువారం మధురానగర్ పరిసరాల్లో పర్యటించిన ఆయన, అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

ఈ క్రమంలో మధురానగర్ రైల్వే ట్రాక్ ఎక్కారు. బుడమేరు వరద కొనసాగుతుండటంతో, కింద నుంచి సరిగా కనిపించడం లేదని బ్రిడ్జిపై ట్రాక్ ఎక్కారు. అదే సమయంలో ట్రాక్ పై నుంచి ట్రైన్ వస్తోంది. దీన్ని గమనించి సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను కిందకు దింపే ప్రయత్నం చేశారు.

కానీ, అప్పటికే ట్రైన్ స్పీడ్‌గా ఉంది. వెంటనే అలర్ట్ అయిన ట్రాక్ మెన్ ఎర్ర జెండా ఊపడంతో పెను ప్రమాదం తప్పింది. దీనితో పార్టీ నేతలు, అధికారులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇది సోషల్‌మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది.