Mahanaadu-Logo-PNG-Large

ఐ ప్యాక్‌ బృందంతో సీఎం జగన్‌ భేటీ

వైసీపీకి 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాలు
తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం
ఫలితాలు చూసి దేశమే షాక్‌ కాబోతుందని వ్యాఖ్య

విజయవాడ, మహానాడు: ఎన్నికలయ్యాక మొదటిసారి విజయవాడలోని ఐ ప్యాక్‌ బృందంతో గురువారం సీఎం జగన్మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. పేరుపేరున ఐ ప్యాక్‌ టీం సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి అధికా రంలోకి రాబోతున్నామని గత ఎన్నికల్లో సాధించిన 151 సీట్ల కన్నా ఎక్కువ స్థానాలు గెలవబోతున్నామని, 22 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ఐ ప్యాక్‌ టీం చేసిన సేవలు వెలకట్టలేనిదని ప్రశంసించారు. వచ్చే ఫలితాలు చూసి దేశమే షాక్‌ అవుతుంది. రాష్ట్రంలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని స్పష్టం చేశారు. ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తామని తెలిపారు.