కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలి

ఎమ్మెల్సీ లక్ష్మణరావు వినతి

అమరావతి, మహానాడు : కాంట్రాక్ట్‌ అధ్యాపకుల రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ ప్రారంభించాలని కోరుతూ సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రివర్యులు ప్రయ్యావుల కేశవ్‌కు ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మెమోరాండం సమర్పించారు. జూనియర్‌ కళాశాలలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకుల రెన్యువల్‌ ఫైల్‌ ప్రస్తుతం ఆర్థిక శాఖలో మధుబాబు వద్ద ఉన్నది. తదుపరి ఆ ఫైల్‌ జాయింట్‌ కార్యదర్శి గౌతమ్‌ వద్దకు, ఆ తదుపరి ఆర్థిక శాఖ కార్యదర్శి జానకి ఆమోదం పొందుతుందని తెలిపారు.