ఓటు బ్యాంకు రాజకీయాలతో మోసం
తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి ధ్వజం
తిరువూరు, మహానాడు : ఐదేళ్లుగా దళితులపై వైసీపీ ప్రభుత్వం అనేక అరాచకాలకు పాల్పడిరదని, దళితులకు మోసపూ రిత వాగ్దానాలు చేసి పేదరికంలో నెట్టిందని తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస రావు ధ్వజమెత్తారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో అభివృద్ధి, సంక్షేమం, పిల్లలకు విద్య పథకాలను అమలుచేస్తే జగన్ వచ్చాక పూర్తిగా రద్దు చేశారన్నారు. దళితులు వెనుకబడే ఉండాలని అన్ని సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసి ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నాడని మండిపడ్డారు.
చంద్రబాబు అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తే జగన్ వాటిని రద్దు చేసి దళితులు కూలీ పనులకు వెళ్లేలా చేశాడని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను మళ్లించి జగన్ దళితులకు ద్రోహం చేశాడని, వెనకబడిన దళితులకు అదనంగా పథకాలను ఇవ్వాలని రాజ్యాంగంలోనే ఉందన్నారు. జగన్ ను ఓడిరచి కూటమి అధికారంలోకి రాగానే అన్ని సంక్షేమ పథకాలను పునరుద్ధరించుకుం దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.