Mahanaadu-Logo-PNG-Large

నిందితుడి జాబితాలో దస్తగిరి పేరు తొలగింపు

– సీబీఐ కోర్టు ఉత్తర్వు
– ఇక దస్తగిరి సాక్షి మాత్రమే
– వివేకా కేసులో కొత్త మలుపు

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల జాబితా నుంచి.. నాలుగో నిందితుడిగా ఉన్న దస్తగిరి పేరును సీబీఐ కోర్టు తొలగించింది. తనను నిందితుడిగా కాకుండా సాక్షిగా మాత్రమే పరిగణించాలని సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్‌ను గురువారం నాడు కోర్టు స్వీకరించింది. ఈ క్రమంలో సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు, దస్తగిరి పేరును తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే సీబీఐ అధికారులు దాఖలు చేసిన అభియోగపత్రంలోనూ తనను సాక్షిగా చేర్చిన విషయాన్ని కూడా దస్తగిరి పేర్కొన్నారు.

దస్తగిరి వాదనలను పరిగణలోనికి తీసుకున్న సీబీఐ కోర్టు నిందితుల జాబితా నుంచి పేరు తొలగించింది.