Mahanaadu-Logo-PNG-Large

వేములవాడ ఆలయానికి భక్తుల తాకిడి

వేములవాడ: స్థానిక రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కలతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకుని సేవలో తరించారు. స్వామి వారికి ఇష్టమైన సోమవారం రోజు కావడంతో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.