ధాన్యం మొలకెత్తుతున్నా కొనరా?

తరుగు పేరుతో మరో మోసమా?
మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం
కొనుగోలు కేంద్రం సందర్శన

సిద్దిపేట, మహానాడు : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడు తూ తుఫాన్‌ ప్రభావంతో వచ్చే మూడురోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ప్రభుత్వం రోజుల తరబడి వడ్లు కొనకపోవడం వల్ల వడ్లు తడిచే అవకాశం ఉందన్నారు. చిన్నకోడూరు కేంద్రాల్లో రైతులు 20 రోజులుగా వేచిచూస్తున్నారని తెలిపారు. ధాన్యం ఒకటికి రెండుసార్లు తడిసి మొలకెత్తింది. రైస్‌ మిల్లుకు వెళ్లాక తేమ శాతం ఎక్కువ ఉందని, మొలకెత్తిందని కొనడం లేదని తెలిపారు. ఒకవేళ కొన్నా తరుగు తీసేయడం వల్ల సంచికి మూడు కిలోలు కోత పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. తరుగు లేకుండా వెంటనే వడ్లు కొనాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తడిచిన, మొలకెత్తిన వడ్లను కూడా కొనాలని కోరారు. 40 శాతం ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది. లారీల సంఖ్య పెంచి ధాన్యాన్ని కొనాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

జిల్లా మొత్తం దొడ్డు వడ్లే..

చిన్నకోడూరు రైతులతో మాట్లాడినప్పుడు ఇంటి అవసరాలకు మాత్రమే సన్న వడ్లు పండిస్తామని, పండిరచే మిగతా వడ్లన్నీ దొడ్డువడ్లేనని చెబుతున్నారు. పెట్టుబడి ఎక్కువ దిగుబడి తక్కువైన సన్నరకాన్ని సాధారణంగా రైతులు సాగు చేయరు. సిద్దిపేట జిల్లాలో 3,38,389 ఎకరాల్లో వరి సాగయింది. 3 లక్షల 21 వేల ఎకరాల్లో దొడ్డు రకం వేశారు. 16 వేల ఎకరాల్లో మాత్రమే సన్నరకం వేశారు. రూపాయికి 95 శాతం దొడ్డు వడ్లు పండిరచే వాళ్లకు బోనస్‌ ఎగ్గొట్టి కేవలం ఐదు శాతం సన్నబడ్లు పండిరచే వాళ్లకు బోనస్‌ ఇస్తామనడం రైతులను దగా చేయడమే. ఎకరానికి 7500 రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయ పనులు మొదలుకాక ముందే జూన్‌లోనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తు న్నాం. ఆగ్రో సేవా కేంద్రాల్లో పచ్చి రొట్టె విత్తనాలు ఇవ్వడం లేదు. విత్తానాల కోసం రైతుల పాస్‌ పుస్తకాలు లైన్లో పెట్టి వేచి చూసే పరిస్థితి ఏర్పడిరది. రాష్ట్రంలో ఎక్కడా కూడా పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులో లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్న విషయం తెలుసుకోవడానికి మంత్రులు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని కోరారు.