రాజస్థాన్: సంజనా జాతవ్ (25) దళిత వర్గానికి చెందిన మహిళ. రాజస్థాన్లోని భరత్పూర్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి 51,983 ఓట్లతో బీజేపీ అభ్యర్థి రాం స్వరూప్ కోలీపై విజయం సాధించారు. 18వ లోక్సభకు ఎన్నికైన అతి పిన్న వయస్కులలో ఆమె ఒకరు. 2019లో మహారాజా సూరజ్మల్ బ్రిజ్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జాతవ్ ఈ ఎన్నికల్లో రాజకీయ ప్రవేశం చేశారు.