వరద బాధితుల సహయార్థం రూ.1.50 లక్షల విరాళం

-ఎమ్మెల్యే కేపికి నగదు చేసిన తెదేపా నేత గొరిజాల చిన్ని 

ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన కీ.శే.గొరిజాల హరిశ్చంద్రరావు (చిన్నబ్బాయి) వారి ధర్మపత్ని కీ.శే గొరిజాల అనసూయమ్మ వారి కుమారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు గొరిజాల సాంబశివరావు (చిన్ని) వరద బాధితుల సహాయార్ధం రూ.1.50 లక్షల విరాళం అందజేశారు. ఈ సొమ్మును మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదుకి నగదు రూపంలో గురువారం గొల్లపూడిలో అందజేశారు. ఇందులో రూ.1 లక్ష మైలవరం నియోజకవర్గంలోని వరద బాధితుల కోసం కాగా, రూ.50 వేలు తన స్వగ్రామమైన మూలపాడు గ్రామంలోని బాధితుల కోసం వెచ్చించాలని సూచించారు.

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తన వంతు సాయం అందించిన చిన్నిని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ప్రత్యేకంగా అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సొమ్మును వెంటనే నియోజకవర్గ స్థాయిలో, గ్రామస్థాయిలో వరద బాధితుల సహాయం కోసం వెచ్చించాలని నిర్వాహక నేతలకు ఎమ్మెల్యే కేపి అందజేశారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్ఫూర్తితో తన వంతు సాయం అందించానని, చైతన్యంతో అందరి ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవడానికి విరాళాలు విరివిగా అందజేయాలని తెదేపా నాయకులు చిన్ని విజ్ఞప్తి చేశారు.