Mahanaadu-Logo-PNG-Large

నా కోసం ట్రాఫిక్‌ ఆపొద్దు…ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు

కాన్వాయ్‌ ఒక నిమిషం ఆలస్యమైనా పర్లేదు
సీఎం కూడా మనిషే…ఇకపై పరదాలు ఉండవ్‌
ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు

విజయవాడ: నగరంలోని ఏ కన్వెన్షన్‌లో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం పర్యటనలో ట్రాఫిక్‌ ఆంక్షల గురించి ప్రస్తావించారు. సీఎం కూడా మామూలు మనిషేనని, ముఖ్యమంత్రి వస్తున్నారంటే పరదాలు కట్టటం, దుకాణాలు బంద్‌ చేయటం, ట్రాఫిక్‌ నిలిపివేయటం, చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండవని తెలిపారు. తన కాన్వాయ్‌ ఒక నిమిషం ఆలస్యమైనా పర్లేదు కానీ, ట్రాఫిక్‌ నిబంధనలు పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. తనకు ఒక ఐదు నిమిషాలు లేట్‌ అయినా పర్వాలేదు.. కానీ, తన కోసం ట్రాఫిక్‌ను ఆపి ప్రజలను ఏ మాత్రం ఇబ్బందులు పెట్టొద్దంటూ మరోసారి పోలీసులకు సూచించారు.