Mahanaadu-Logo-PNG-Large

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి

• రాష్ట్ర భవిష్యత్ ఓటర్ల చేతుల్లో ఉంది. ఎండకు వానకు భయపడకూడదని విన్నపం
• 90శాతం పోలింగ్ దాటేలా ఓటర్లు తమ పవిత్రమైన ఓటును వినియోగించుకోవాలి
• ఉదయం 7 గంటల నుండి 11 గంటల్లోపు అధిక శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలి
• ఎన్నికల కమిషన్ ఓటర్లకు మౌళిక సదుపాయాలు కల్పించాలి, అవసరమైన వారికి సహాయకులను ఏర్పాటు చేయాలి
• నేడు అంతర్జాతీయ తల్లుల దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలో ఓ తల్లి ఆక్రందన, ఆవేదన, ఆత్మఘోష రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి
• బాపట్లలో దళితున్ని కొట్టిన కోన వెంకట్, ఎస్సై జనార్థన్ ను వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలి

రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోని దుర్మార్గాన్ని తరిమికొట్టి రాష్ట్ర భవిష్యత్ లో భాగస్వామ్యం కావాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య విజ్ఞప్తి చేశారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్ ఓటర్ల చేతుల్లో ఉంది.. ఎండకు వానకు భయపడకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. గత ఎన్నికల్లో పట్టణ ప్రాంతాలు హైదరాబాద్, బెంగుళూరులాంటి సిటీల్లో 40% పోలింగ్ మాత్రమే నమోదు ఐయింది. మన రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్య పట్టణ, పల్లె ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోని రాష్ట్ర ఉన్నతికి సహకరించాలి. 90శాతం పోలింగ్ దాటేలా ఓటర్లు తమ పవిత్రమైన ఓటును వినియోగించుకోవాలి. ఉదయం 7 గంటల నుండి 11 గంటల్లోపు అధిక శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలి.

దుర్మార్గపు ఆలోచనలు, దొంగ ఫోటోలతో మోసం చేస్తారు కొంత మంది.. మోసపోకండి. ఓటును హక్కుగా భావించండి. మీ హక్కును ఓటుగా బూత్ లో వేయండి. ఇంకు పూసినా.. ఇంకేది చేసినా పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండి. ఇంకు రాసినంతమాత్రాన ఓటు హక్కు హరించలేరు. నీవు వెళ్లేటప్పటికే మీ ఓటును ఎవరైనా వేస్తే ఛాలెంజ్ ఓటు అడిగి తీసుకుని మీ ఓటు హక్కును వినియోగించుకోండి. అప్పటికే మీ ఓటును ఎవరైనా వేశారని అధికారి చెబితే మీరు టెండర్ ఓటు హక్కును కూడా వినియోగించుకోవచ్చు.

ఓటు వేయకుండా అపవిత్రం చేయకండి… దుర్మార్గుల చేతికి మీ ఓటును వెళ్లనివ్వకండి. ఎన్నికల కమిషన్ ఓటర్లకు మౌళిక సదుపాయాలు కల్పించాలి. అవసరమైన వారికి సహాయకులను ఏర్పాటు చేయాలి. వర్షం పడితే ఒటర్లు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలి. దివ్యాంగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయాలి. ఓటు వేసేటప్పుడు పోలింగ్ అధికారుల సహాయం తీసుకునే ముందు తగు జాగ్రత్తలు ఓటర్లు తీసుకోవాలి.

నేడు అంతర్జాతీయ తల్లుల దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలో ఓ తల్లి ఆక్రందన, ఆవేదన, ఆత్మఘోష రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. బాపట్లలో దళితున్ని కొట్టిన కోన వెంకట్, ఎస్సై జనార్థన్ ను వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఓట్లను ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టాలి. దుర్మార్గాన్ని అరికట్టాలి. పోలింగ్ శాతం పెంచాలని వర్లరామయ్య విజ్ఞప్తి చేశారు.