` సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఆదేశం
అమరావతి, మహానాడు: సోషల్ మీడియాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదివారం టీడీపీ ఫిర్యాదు చేసింది. ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబే కారణమని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జ్ సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో ఓటర్లను, పింఛన్ లబ్ధిదారులను తప్పుదోవ పట్టించేలా ఫోన్లు చేశారని, కుట్ర పూరితంగా విద్వేషాలు రెచ్చగొట్టేలా తప్పుడు ప్రచారం చేశారని టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ ఐవీఆర్ఎస్ కాల్స్పై సీఐడీ దర్యాప్తు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిం ది. విచారణ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని సీఐడీ డీజీకి సూచించింది.