-ఆయన ఉంటే కౌంటింగ్ సజావుగా జరుగుతుందన్న నమ్మకం లేదు
-అధికార యంత్రాంగాన్ని, అధికారాలను దుర్వినియోగం చేశారు
-కొడుకు, బినామీల పేరిట 800 ఎకరాలు కొన్నారు
-జిస్ట్రేషన్ కోసం అధికారులను ప్రభావితం చేస్తున్నారు
-కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్కు కనకమేడల లేఖ
అధికారాలను దుర్వినియోగం చేసిన సీఎస్ జవహర్రెడ్డిని కౌంటింగ్ బాధ్యతల నుంచి తప్పించాలని టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ మంగళవారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్కు లేఖ రాశారు. ఏపీ సీఎస్ జవహర్రెడ్డి ప్రభుత్వ అసైన్డ్ భూములను పెద్దఎత్తున కొనుగోలు చేశారని వెల్లడిరచారు. తన కుమారుడు, బినామీల పేరిట సీఎస్ 800 ఎకరాలు కొనుగోలు చేశారని కనకమేడల తెలిపారు. ఇప్పుడు భూముల రిజిస్ట్రేషన్ కోసం అధికారులను ప్రభావితం చేస్తున్నారని తన లేఖలో పేర్కొన్నారు. సీఎస్ అధికార యంత్రాంగాన్ని, తన అధికారాలను దుర్వినియోగం చేశారని వివరించారు. ఎన్నికల నియమావళిని కూడా ఉల్లంఘించారని తెలిపారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ సజావుగా జరుగుతుందన్న నమ్మకం ప్రతిపక్షాలకు లేదని వెల్లడిరచారు. సీఎస్ వ్యవహార శైలి ఓట్ల లెక్కింపుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను తొలగించి సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు.