Mahanaadu-Logo-PNG-Large

నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టండి 

ఎస్పీని కోరిన ఎమ్మెల్యే గళ్ళ మాధవి

గుంటూరు, మహానాడు:  పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే గళ్ళ మాధవి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ను కోరారు. నగరంలో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, బైక్ రేసింగ్ లపై దృష్టి పెట్టాలని సూచించారు. నగరంలో గంజాయి సరఫరాపై పూర్తి సమాచారాన్ని ఎస్పీకి అందించారు. నగరంలో ఈట్ స్ట్రీట్ పై దృష్టి సారిస్తామన్నారు. నగరంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలకు తావు లేకుండా చూస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.