ప్రజల మధ్యకు గళ్ళా మాధవి 

గుంటూరు, మహానాడు :  గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి  తన నియోజక వర్గంలోని ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు డివిజన్ పర్యటనకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఉదయం 6.00 గంటలకే 18వ డివిజన్ లోని రామనామ క్షేత్రం, శ్రీనివాసరావు పేట,వెంగళ్ శెట్టి వారి వీధి, అడపా బజార్, మొహిద్దీన్ పాలెం, వడ్డే గూడెం వంటి ప్రాంతాలలో పర్యటించారు. ఆమె స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుతూ, డివిజన్ లోని ప్రధాన వీధులతో పాటు, సందులలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ.. 18 డివిజన్ లో ప్రధానంగా తనకు డ్రైనేజి, వీధి దీపాలు, మంచి నీటి పైపుల లీకులు, రోడ్లు  వంటి ప్రజాసమస్యలు తన  దృష్టికి వచ్చాయని, క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు తానే స్వయంగా వచ్చినట్లు పేర్కొన్నారు. వర్షాకాలం దృష్ట్యా ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని  శానిటరీ ఇన్స్పెక్టర్, వాటర్ ఏఈ, సంబంధిత అధికారులను ఆదేశించారు.