రైళ్లలో జనరల్‌ బోగీలను పెంచాలి

నిత్యం దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులు రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. జనరల్‌ బోగీల్లో ప్రయాణించే సామాన్యుల పరిస్థితి దయనీయంగా ఉంది. సీట్లు తక్కువగా ఉండటం, స్థలం లేకపోవడం, తొక్కిసలాటలు, గాయాలు, కొన్ని సందర్భాల్లో ఊపిరాడక చిన్నారుల ప్రాణాలు పోయిన సందర్భాలున్నాయి. రెండో అతిపెద్ద రవాణా వ్యవస్థగా ఉన్న రైల్వేలు ప్రజలకు అందిస్తున్న సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.

అదే సమయంలో దూర ప్రాంత ప్రయాణాలకు అనువుగా ఉండే అనేక రైళ్లలో స్లీపర్‌ క్లాస్‌ బోగీల కుదింపు వేగంగా జరుగుతోంది. స్లీపర్‌ బోగీలను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు. స్లీపర్‌ స్థానంలో ఏసీ బోగీల సంఖ్య ను పెంచుతున్నారు. విశాఖ, గోదావరి, ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ల తరహాలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో స్లీపర్‌ క్లాస్‌ బోగీలకు కోత పడుతోంది. ఫలితంగా సీటు లేదా బెర్త్‌ రిజర్వేషన్‌ దొరక్క ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఎంతముందుగా ప్రయాణం కోసం రిజర్వు చేయించుకోవాలని ఆశించినా సెలవులు, పండుగల సందర్భాల్లో టిక్కెట్లు దొరకట్లేదు.

ఫలితంగా జనరల్‌ టికెట్‌ తీసుకుని ప్రయాణించేవారు నిల్చోవడానికి కూడా ఖాళీ దొరక్క స్లీపర్‌ క్లాసు బోగీల్లో ఎక్కేస్తున్నారు. ఇది రిజర్వేషన్‌ లేని వారితో పాటు, రిజర్వేషన్‌ ఉన్న ప్రయాణికులకు కూడా ఇబ్బందిగా మారు తోంది. జనరల్‌ బోగీలతో సమానంగా ఇప్పుడు రిజర్వుడు స్లీపర్‌ క్లాస్‌ బోగీలు కిక్కిరిసిపోతున్నాయి. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర సమస్యలను ఎదు ర్కొంటున్నారు. వేసవిలో దూర ప్రయాణాలకు వెళ్లేవారి సమస్య ఇంకా తీవ్రంగా ఉంది. ఇప్పటికైనా రైల్వే మంత్రిత్వ శాఖ వారు సామాన్య ప్రయాణికుల ప్రయో జనాలను దృష్టిలో ఉంచుకుని సాధారణ, స్లీపర్‌ క్లాస్‌ బోగీలను పెంచాల్సిందిగా కోరుతున్నాం.

అప్పన్న గొనప,
విశాఖపట్నం,
9440733620