భీమవరం రైల్వేస్టేషన్‌లో గోనె ప్రకాశరావు

భీమవరం: కాకినాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే రైలు 12 గంటలు ఆలస్యం కావడంతో భీమవరం రైల్వేస్టేషన్‌లో సేదదీరుతూ కనిపించారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వచ్చి ఆయన కొన్నిరోజులుగా రైళ్లు, బస్సులు, ఆటోల్లో తిరుగుతూ సర్వేలు చేస్తున్నారు. అంతరాలు లేని తెలుగు సమాజాన్ని కాంక్షించే ఆయన జీవితం నేటి తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకం.