Mahanaadu-Logo-PNG-Large

హెలిప్యాడ్‌ స్థలాన్ని పరిశీలించిన గొట్టిపాటి లక్ష్మి

దర్శి: ఈ నెల 4న శనివారం దర్శిలో చంద్రబాబు ప్రజాగళం జరగనున్న దృష్ట్యా దర్శిలోని పొదిలి రోడ్డులో హెలిప్యాడ్‌ ప్రాంతాన్ని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, లలిత్‌సాగర్‌, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, పిచ్చయ్య, చిట్టెం వెంకటేశ్వర్లు, దారం సుబ్బారావు, పుల్లలచెరువు సత్యనారాయణ, కర్ణ శీను, సంగు కొండలు, మాగం సుబ్బారావు, సంగు చంద్ర, నారపుశెట్టి శ్రీను పరిశీలించారు. ఇప్పటికే పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. చంద్రబాబు పొదిలి రోడ్డులోని హెలిప్యాడ్‌ నుంచి రోడ్‌ షోతో ఉదయం 10 గంటలకు గడియా ర స్తంభం వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని నాయకులు తెలిపారు.