ఐజీని కలిసిన గొట్టిపాటి లక్ష్మి

గుంటూరు, మహానాడు: గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని దర్శి తెలుగుదేశం కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గుంటూరులోని డిఐజి క్యాంపు కార్యాలయంలో గురువారం ఐజీతో భేటీ అయ్యారు.  దర్శి నియోజకవర్గంలో శాంతిభద్రతలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఎన్నికల సమయంలో ఆ తర్వాత వైసీపీ దాడులపై పోలీసు శాఖ సీరియస్ గా  తీసుకొని పనిచేయాలని కోరారు. ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా జీవించేందుకు పోలీస్ సిబ్బంది సహకరించాలని కోరారు.