Mahanaadu-Logo-PNG-Large

టీడీపీ దాడులపై గవర్నర్‌ జోక్యం చేసుకోవాలి

రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంది
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు రక్షణ కల్పించండి
ఎక్స్‌ వేదికగా వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి

అమరావతి: రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఎక్స్‌ వేదికగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలపై దాడులతో భయానక వాతావరణం ఏర్పడిరది. ప్రభుత్వం ఏర్పాటు కాక ముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు వంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ను ధ్వంసం చేస్తున్నారు. వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మా రింది. ఐదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్‌ వెంటనే జోక్యం చేసుకుని అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణా లకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని కోరారు. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని తెలిపారు.