విజయవాడ, మహానాడు: స్థానిక వెన్నపూస కాలనీలోని గీతాంజలి రెసిడెన్షియల్ స్కూల్ లో సోమవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డైరెక్టర్ వై.శేషగిరి రావు విచ్చేసి చిన్నారులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందించారు. ప్రిన్సిపాల్ టి. కృష్ణవేణి మాట్లాడుతూ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యాసంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రతి ఒక్క విద్యార్థి శ్రీకృష్ణుని ఆదర్శంగా తీసుకొని చెడును విసర్జించి మంచి మార్గంలో నడవాలి అని సూచించారు. అనంతరం చిన్నారులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో చేసిన ప్రదర్శనలు చూపరులను విశేషంగా అలరించాయి. చిన్నారులకు ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించగా పోటీ పడి మరి పాల్గొన్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ వైఎల్ కిషోర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.