Mahanaadu-Logo-PNG-Large

హరిత తారామతి బారదారి రిసార్ట్స్‌ అధ్వానం

నిర్వహణ లోపాలపై పర్యాటక మంత్రి జూపల్లి ఆగ్రహం
ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశం
భవిష్యత్‌లో గోల్కొండ ఫెస్టివల్‌ నిర్వహించనున్నట్లు వెల్లడి

హైదరాబాద్‌: హరిత తారామతి బారదారి రిసార్ట్స్‌లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రిసార్ట్స్‌ అంతా కలియదిరిగారు. హరిత హోటల్‌ రూమ్స్‌, హరిత రెస్టారెంట్‌, పుష్పాంజలి ఆంఫి థియేటర్‌, ఆడిటోరియం, స్విమ్మింగ్‌ ఫూల్‌, టాయిలెట్స్‌ను పరిశీలిం చారు. రిసార్ట్స్‌ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంట్రన్స్‌ దగ్గర గుంత లు పడ్డాయని వెంటనే మరమ్మతులు చేపట్టాలని, చెత్త చెదారాన్ని తొల గించా లని, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పనులు వెంటనే పూర్తి చేయాలని అధికా రులను ఆదేశించారు. ఉద్యోగులు, సిబ్బంది ఎంత మంది ఉన్నారు? వేతనాలు సకాలంలో అందుతున్నాయా లేదా? అని ఆరా తీశారు. హరిత రిసార్ట్‌ నిర్వహ ణ, వసతుల కల్పనపై పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

నిర్వహణ లోపమే కారణం

అనంతరం మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ తారామతి బారదారి ప్రైమ్‌ లొకేషన్‌లో విశాలమైన స్థలం ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదని, దీనికి నిర్వహణ లోపమే ప్రధాన కారణమన్నారు. ఎన్నికల కోడ్‌ కారణంగా పర్యాటక, ఎక్సైజ్‌, సాంస్కృతిక శాఖలపై సమీక్షలు చేయలేకపో యాం. ఇప్పటినుంచి ప్రతి నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం. ప్రభుత్వ సంస్థలను కూడా ప్రైవేట్‌తో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రభుత్వ ఆదాయం పెంచడంతో పాటు పర్యాటకులు, సందర్శకులకు మెరుగైన వసతుల కల్పనపై దృష్టి పెడతామని వెల్లడిరచారు. మూడు, నాలుగు నెలల్లో కఠిన నిర్ణయాలు తీసుకుని వాటి రూపురేఖలను మారుస్తామని వివరించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తామని, భవిష్యత్‌లో గోల్కొండ ఫెస్టివల్‌ నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమేష్‌ నాయుడు, జీఎం (ప్రాజెక్ట్స్‌) ఉపేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.