Mahanaadu-Logo-PNG-Large

5 రోజుల్లో ₹579 కోట్లు సంపాదించిన హెరిటేజ్!

ఏపీలో చంద్రబాబు ఘన విజయంతో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్లు గత 5 రోజుల్లో రికార్డు స్థాయిలో 55% పెరిగాయి. ఇవాళ కూడా 10% పెరిగి అప్పర్ సర్క్యూట్ ని తాకాయి. జూన్ 3న (ఎన్నికల ఫలితాలకు ముందు రోజు) రూ.424గా ఉన్న హెరిటేజ్ షేర్.. ఇవాళ రూ.661కి చేరింది. తద్వారా ఆ కంపెనీ ప్రమోటర్ భువనేశ్వరి సంపద 5 రోజుల్లో రూ.579 కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. హెరిటేజ్ లో భువనేశ్వరి 24.37 శాతం వాటాను కలిగి ఉన్నారు.