Mahanaadu-Logo-PNG-Large

పాస్టర్లకు గౌరవ వేతనం, ఇళ్ల స్థలాలు ఇస్తాం

– దళితులకు 50 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం
-మాచర్ల పాస్టర్ల ఆత్మీయ సమావేశంలో లావు, జూలకంటి

మాచర్ల, మహానాడు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పాస్టర్లకు గౌరవ వేతనం అందిస్తుందని, అర్హతను బట్టి ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేయిస్తామని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు. శనివా రం మాచర్ల పట్టణంలోని, నరిశెట్టి కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి పాస్టర్ల ఆత్మీ య సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అధికారంలోకి రాగానే మొదటి రెండు మూడు నెలల్లోనే సమావేశం నిర్వహించి పాస్టర్లకు ఇళ్ల స్థలాలు కేటాయించే కార్యక్రమం చేస్తామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో పార్లమెంట్‌ వ్యాప్తంగా ఎంపీ నిధులతో దళితులకు 50 కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామని చెప్పారు. అలాగే దళితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, గత ప్రభుత్వంలో రద్దయిన 27 పథకాలను పునరుద్ధరణ చేస్తామని వెల్లడిరచారు. టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పాస్టర్లు పాల్గొన్నారు.