కార్పొరేషన్ అంటూ మళ్లీ మాయమాటలా?
రుణమాఫీపై స్పష్టమైన విధానం ప్రకటించాలి
రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం
రెండు పార్టీలు కుట్రలు చేసినా విజయాన్ని ఆపలేవు
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్
హైదరాబాద్, మహానాడు : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ మా ట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రైతులకు సంబంధిం చిన సమస్యలపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో పంట విస్తీర్ణం, దిగుబడి గణనీయంగా తగ్గింది. వ్యవసాయానికి కరెంటు కోతలు పెరిగాయి. కాల్వలకు నీళ్లు అందని పరిస్థితి నెలకొంది. అనావృష్టి, అకాల వర్షాలతో పంటనష్టం జరిగితే ప్రభుత్వం మొక్కుబడిగా పరిహారం చెల్లిస్తామని ప్రకటించి రెండుసార్లు రైతులను మోసం చేసింది. వరి కోతలు కోసి ధాన్యం కుప్పలుగా పేరుకుపోతే కొనుగోలు చేయ కుండా ఇబ్బంది పెడుతోందని విరుచుకుపడ్డారు. చాలా మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చనేలేదని మండిపడ్డారు. ధాన్యానికి మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ వచ్చి కొనుగోలు చేస్తామని గొప్పలు చెప్పారు. రూ.2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి చేయనేలే దు. రైతుబంధు విషయంలోనూ జాప్యం చేస్తూనే ఉన్నారు. రైతు కార్పొరేషన్ అంటూ మళ్లీ కొత్తగా మాటలు చెబుతున్నారు. ఒక వైపు ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటింది. ఇప్పడు కార్పొరేషన్కు రుణం దక్కాలంటే బడ్జెటే తర రుణం కావాలి. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు రుణమాఫీ ఏ విధంగా చేయగలుగుతారనే విషయాన్ని స్పష్టం చేయకుం డా తాత్సారం చేస్తూ రైతులను శాశ్వతంగా రుణగ్రస్తులుగా చేస్తోంది.
రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటుచేయాలి
రాష్ట్ర ప్రభుత్వం రైతు సహకార రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. మరోవైపు సబ్సిడీ విత్తనాలు, డ్రిప్, స్ప్రింకర్లు ఇవ్వకుండా గాలికొదిలేసింది. పంట నష్టపరిహారం ఇవ్వకుం డా రైతులను తిప్పలు పెడుతోంది. ఫసల్ బీమాను అమలు చేస్తామని చెప్పి పంట విస్తీర్ణానికి రాష్ట్ర వాటా కట్టడానికి ముందుకు రాలేదు. మరోవైపు ఉద్యానవనాలు, పశుసంపద, పాడిపరిశ్రమ, కోళ్లపరిశ్రమ అథోగతి పాలైంది. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభం వైపు నెట్టబడుతుతోంది. రాష్ట్రంలో దివాళా తీసిన ఖజానాతో ఆర్థిక సంక్షోభం తో కొట్టుమిట్టాడుతుంటే కొత్త కార్పొరేషన్ ఏర్పాటు అంటూ మాటలు చెబుతున్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం త్వరిగతిన సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రైతు సంఘాల ప్రతిని ధులు, మేధావులతో సమావేశం ఏర్పాటు చేసి రైతుల సమస్యలపై చర్చించి పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తున్నాం.
ఉచిత విద్యుత్లో వైఫల్యం
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉచిత విద్యుత్ను రోజురోజుకు నీరుగార్చుతోంది. ఉచి త విద్యుత్ను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని అఖిలపక్ష సమావేశంతో పాటు రైతు సంఘాల ప్రతినిధులతో యుద్ధప్రాతిపదికన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రస్తావించిన అంశాలను లోతుగా పరిశీలిస్తే రెండు పార్టీల మధ్య రాజకీయ బంధం, అనుబంధం, సంబంధం చాలా ప్రగాఢంగా ఉందనేది అర్థమైంది. అభ్యర్థుల ఎంపికలో కనపడిరది. ఓటింగ్ సరళిని చూస్తే అదే విషయం బయటపడిరది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీని నిరోధిం చేందుకు ఓటుకు నోటు కేసులో రేవంత్ను కాపాడారు. నేడు మళ్లీ బీజేపీని నిరోధించేం దుకు రేవంత్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని రకాలుగా కుట్రలు పన్నినా రాష్ట్రంలో బీజేపీ గెలుపును ఆపలేరని హెచ్చరిస్తున్నాం. పార్ల మెంటు ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబో తున్నాయని స్పష్టం చేశారు.