భారీగా ఆస్తినష్టం: ఇద్దరికి స్వల్పగాయాలు
పెనుగొండ, మహానాడు: శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ మండల పరిధిలోని గుడిపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటు చేసిన కియా అనుబంధ పరిశ్రమలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం రాత్రి జరగడంతో కంపెనీలో ఎక్కువమంది లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇద్దరికి స్వల్పగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.