ఎమర్జెన్సీ లో.. వివిధ వేషధారణల్లో మోదీ

ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన కొన్ని అరుదైన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎమర్జెన్సీ సమయంలో పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు ఆయన వివిధ వేషధారణల్లో ప్రజాక్షేత్రంలో తిరిగేవారట. చాలా కాలం కాషాయ వేషధారణలో స్వామీజీగా, తలపాగా ధరించిన సిక్కు వ్యక్తిగా ఆయన అవతారమెత్తారట. ఈ గెటప్ లో ఆయన సన్నిహితులు సైతం గుర్తించలేకపోయారని ‘మోదీ ఆర్కైవ్’ ట్వీట్ చేయగా.. దీనిని మోదీ షేర్ చేశారు.