ఆరోసారి భారత్కు అగ్రస్థానం
హైదరాబాద్ : ప్రపంచంలోనే 2023లో అత్యధిక సంఖ్యలో గ్లోబల్ ఇంటర్నెట్ షట్డౌన్ లు భారత దేశంలో అత్యధికంగా నమోదయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉద్దేశపూర్వకంగా ఇంటర్నెట్ డిస్ కనెక్ట్ చేయబడిన సంఘటనలు 116 జరిగాయి. దీంతో గ్లోబల్ ఇంట ర్నెట్ షట్డౌన్లలో భారత్ వరుసగా ఆరోసారి అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో మయన్మార్ (37), తర్వాతి స్థానాల్లో ఇరాన్ (34), పాలస్తీనా (16), ఉక్రెయిన్ (8) ఉన్నాయి.