బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్
విజయవాడ, మహానాడు : కేంద్రం బీసీలకు నిధులు విడుదల చేస్తుంటే వాటిని పక్కదారి పట్టించారని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 56 కుల కార్పొరేషన్లు పెట్టిన జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా అవమానించారన్నారు. బీసీ సబ్ప్లాన్ నిధుల మీద వైసీపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయకుండా కాలయాపన చేసిందని విమర్శించారు. ఈ సమా వేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయినం బాలకృష్ణ గౌడ్, బి.ఎస్.కె.పట్నాయక్, రాష్ట్ర కార్యదర్శి శివలలిత, కె.సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.