చెరువుల కోసం ‘అక్రమాలు’ కూలుతాయ్‌!

– అక్రమార్కులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా రాజధాని నగరంలో, తరువాత అన్ని జిల్లాల్లో చెరువులు ఆక్రమించి కట్టడాలు ఉంటే తప్పక కూలుతాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సహజ వనరులైన చెరువులు పునరుద్ధరణలో భాగంగా ఈ చర్య తప్పదని ఆయన అక్రమార్కులను హెచ్చరించారు.

భౌగోళిక పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యం నుండి వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి, పర్యావరణానికి పెద్దపీట వేయడానికి గతంలో ఉన్న చెరువులకు ప్రభుత్వ లెక్కలకు రికార్డులకు అనుగుణంగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా చెరువుల పరిరక్షించుకోవాలని స్వచ్ఛంద సంస్థలకు, గతంలో ఇక్కడ చెరువు ఉండే అని తెలిసిన వారు స్థానికులు ఎవరైనా పోలీసు అధికారులు, రెవెన్యూ ఇలా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి చెరువుల పరిరక్షణ స్థానికులదే.. ప్రభుత్వం ఎవరి మీద రాజకీయ కక్ష సాధింపు లేదు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది.. ప్రభుత్వం చేస్తున్న పనిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్శిస్తున్నారు.. ఎక్కడైనా అన్యాయం జరిగింది అంటే న్యాయ స్థానాలు ఉన్నాయి.. చెరువులు ఆక్రమణల పై ప్రభుత్వం సీరియస్ గా ఉంది.. హైదరాబాద్ ఒకప్పుడు లెక్ సిటీ గా ఉండేది .. చెరువుల పరిరక్షకులు అందరూ ఎక్కడెక్కడ అక్రందనకు గురయ్యాయో వాటి ఆధారాలు ఆనవాళ్లు సంబంధిత అధికారులకు ఇవ్వాలి.. 33 జిల్లాల్లో ఎక్కడైనా గ్రామాలు, మండలాలు, పట్టణాలు, మున్సిపాలిటీ చెరువులు ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాల్లో మీకు ఉన్న అవగాహన, ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి.. ప్రజలంతా ఈ కార్యక్రమం లో భాగస్వామ్యం కావాలి.