Mahanaadu-Logo-PNG-Large

వైసీపీ రిగ్గింగ్‌ను అడ్డుకోవడం తప్పా?

పోలింగ్‌ కేంద్రంలోనే కొట్టారు…
నా కుటుంబంపైనా దాడి చేశారు
కాళ్లు పట్టుకుని బతిమాలినా వినలేదు
పిన్నెల్లి సోదరుల కంటే కిమ్‌ బెటర్‌
వెంకట్రామిరెడ్డి బాధితుడు మాణిక్యరావు ఆవేదన

మాచర్ల, మహానాడు : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి బాధితుడు మాణిక్యరావు ఆదివారం విలేఖరుల సమావేశంలో తనపై, తన కుటుంబంపై జరిగిన దాడిని వివరించారు. వెంకట్రామిరెడ్డి దుర్భాషలాడి అంతుచూస్తామని బెదిరించారు. పోలింగ్‌ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు నన్ను కొట్టారు. టీడీపీ ఏజెంట్‌గా కూర్చునే ధైర్యం నీకెక్కడిది అంటూ దాడి చేశారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి నా కుటుంబంపైనా దాడి చేశారు. పిన్నెల్లి అనుచరులు నా పెద్ద కుమారుడి పొట్టపై తన్నారు. నా వదిన వారి కాళ్లు పట్టుకుని బతిమాలినా వదల్లేదు. నా కుటుంబం పై పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి అంత కక్ష ఎందుకు? ఆయనకు భయపడి అధికారు లు నోరు మెదపలేదు. నాపై దాడి చేస్తున్నా పోలీసులు స్పందించలేదు. డీఎస్పీ ఉండగానే పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి నాపై దాడికి యత్నించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డీఎస్పీని సైతం బెదిరించారు. పిన్నెల్లి సోదరుల కంటే కిమ్‌ బెటర్‌. నన్ను చంపేంత తప్పు నేను ఏం చేశాను? వైసీపీ చేస్తున్న రిగ్గింగ్‌ను అడ్డుకోవడ మే నేను చేసిన తప్పా? అని ప్రశ్నించారు.