మీకు రక్షణ కల్పించడం మా బాధ్యత

– మంత్రి కొండాను కలిసిన అటవీశాఖ అధికారులు
-అమ్మా.. మా ప్రాణాలకు రక్షణ కల్పించండి

– ఫారెస్టు అధికారులకు మంత్రి సురేఖ అభయం

అటవీ భూముల రక్షణలో భాగంగా నిర్వరిస్తున్న విధులకు భంగం కలిగిస్తూ, తమ పై దాడులకు దిగుతున్న వారి పై లా అండ్ ఆర్డర్ ప్రకారం చర్యలు చేపట్టి, తమకు భరోసా కలిగించాలని కోరుతూ తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ శనివారం అటవీశాఖ మంత్రివర్యులు సురేఖని సచివాలయంలోని కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని సమర్పించింది.

తమ ప్రాణాలకు రక్షణ కల్పించి, తమను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు మంత్రి సురేఖన కోరారు. ఈ దిశగా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని, అటవీ అధికారులు, సిబ్బందికి ఏ సాయం కావాలన్నా సిద్ధంగా ఉంటామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. మంత్రి ని కలిసిన వారిలో తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నాగేందర్ బాబు, వైస్ ప్రెసిడెంట్ బి. సాంబు, సెక్రటరీ ప్రశాంత్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. శ్రీనివాస్ రెడ్డి, స్టేట్ జాయింట్ సెక్రటరీ పి.సుకన్య, కోశాధికారి బి. కోటేశ్వర్ రావు తదితరులున్నారు.