తమిళనాడు, కర్నాటకకు సామగ్రి తరలింపు
జూన్ 4లోపు ఖాళీ చేయాలని సూచనలు
టీడీపీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య
అమరావతి, మహానాడు : ఓడిపోతున్నారని తెలిసి తమ సామగ్రిని జగన్ తమిళనాడు, కర్నాటకకు తరలిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య ఆరోపించారు. జగన్ ముఖ్యులతో తాడేపల్లి ప్యాలెస్లో సమావేశమమై అధికారంలోకి రావడం లేదు మనకు సంబంధించిన సామగ్రి జూన్ 4 లోపు కర్ణాటక, తమిళనాడుకు తరలించాలని చెప్పారన్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆయనకు చేరటంతో తాడేపల్లి నుంచి సర్దుకుని వెళ్లిపోవటానికి రెడీ అవుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు జూన్ 8న ప్రమాణ స్వీకారం చేసే లోపు దుకాణం బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.