కేటీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు…

– కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, టీఎస్‌ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి విమర్శ

హదరాబాద్‌, మహానాడు: కేటీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, రాజకీయాలు మీకు..మాకు అవసరమేనని, కానీ ఏం మాట్లాడాలో..ఎలాంటి విషయాలు మాట్లాడాలో వారికి తెలియడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, టీఎస్‌ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.. కేటీఆర్.. ఎక్కడైనా పొలిటికల్ కోచింగ్ సెంటర్ ఉంటే కోచింగ్ తీసుకో బెటర్.. రాజీవ్ గాంధీ దేశ ప్రజల కోసం బలిదానం అయ్యారు.. మిలిటెంట్లు కాల్చి చంపింది నిజమే కదా? కేసీఆర్ గారు.. కేటీఆర్ కి కొంత ట్రైనింగ్ ఇప్పించండి.. రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటేరియట్ ముందు తీసేస్తం అంటాడా..?

ప్రజలు మాకు ఐదేళ్లు అధికారం ఇచ్చారు.. రాజీవ్ గాంధీ .. 18 ఏండ్లు ఉన్న ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు కల్పించారు. కేటీఆర్.. అమెరికా లో ఐటి ఉద్యోగం చేసిన అంటున్నావు.. ఆ ఐటిని తెచ్చింది రాజీవ్ గాంధీ. తెలంగాణ లో నేదురుమల్లి జనార్దనరెడ్డి ఐటి కి పునాది వేశారు. రాజీవ్ గాంధీ తెచ్చిన టెక్నాలజీ తో ఉద్యోగం తెచ్చుకుని ఆయన్నే తిడితే నిన్ను ఏమనాలి..? నువ్వు విగ్రహం తీసేస్త అంటే… మేము చూస్తూ ఊరుకుంటం అనుకుంటున్నావా? ఈ నాలుగేండ్లు రాజీవ్ గాంధీ విగ్రహం ముట్టుకునే ధైర్యం ..దమ్ము నీకు లేదు.. వచ్చే ఐదేళ్లలో కూడా నీకు ప్రజలు అవకాశం ఇవ్వరు..? మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. నీకు నో ఛాన్స్.. మా సీఎం రేవంత్ నీ… చీఫ్‌ మినిస్టర్ అంటున్నావు.. కేటీఆర్ మాటలు చీప్ లిక్కర్ తాగిన వాడి మాటల లెక్క ఉన్నాయి.. కల్లు తాగిన కోతిలెక్క దుంకులాడుతున్నాడు.. కేటీఆర్..

సోనియా గాంధీ..రాహూల్ గాంధీల కు నీతిగా గులాం గురి చేస్తాం.. మీ లెక్క కన్నింగ్ కాదు మేము..
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఇంటికి మీ కుటుంబం అంతా వెళ్లి ఆమె కాళ్ళ మీద పడ్డప్పుడు ఏమైంది.. అప్పుడు మీరు కూడా గులాం చేసినట్టేనా? నీకు అధికారమే రాదు.. ఇంకా ఎయిర్ పోర్ట్ పేరు ఎట్లా మారుస్తాడు కేటీఆర్. పొలిటికల్ పవర్ ఊహించుకోకండి కేటీఆర్. సోనియా గాంధీ మన్ననలు పొందటానికి ప్రయత్నాలు చేయలేదా? అల్లం నారాయణ మేధావి కాదు.. కేసీఆర్ కి బంట్రోతు. పదేళ్లలో జర్నలిస్టుల కష్టాలు..ఇండ్లు గురించి కేసీఆర్ నీ అడిగాడా..? అల్లం నారాయణ ఓ జోకర్.. కెసిఆర్ అయ్య జాగిరా…సెక్రటేరియట్ ముందు జాగా.. ఎందుకు పెట్టొద్దు రాజీవ్ గాంధీ విగ్రహం?
పిల్లలు భావిభారత పౌరులు..వాళ్లకు అన్ని విషయాలు తెలియాలి కాబట్టి వాళ్ళ ముందు రాజీవ్ గాంధీ గురించి మాట్లాడారు. తల్లి గుండెల్లో ఉండాలి.. అందుకే తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్ లోపల పెడతున్నం మేము.. మీ అయ్య మాట్లాడితే ఇంపు.. మేము మాట్లాడితే కంపా?