Mahanaadu-Logo-PNG-Large

జగ్గయ్యపేట అభ్యర్థి తాతయ్య ప్రచారం

జగ్గయ్యపేట, మహానాడు : సైకిల్‌ గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ తోటచర్ల గ్రామంలో జగ్గయ్యపేట టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య బుధవారం ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పెనుగంచిప్రోలు మండ లం తోటచర్ల గ్రామంలో పర్యటించారు. మేనిఫెస్టోలో అంశాలను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కేశినేని శివనాథ్‌ను గెలిపించాలని కోరారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.