Mahanaadu-Logo-PNG-Large

నరసరావుపేట పార్లమెంటు టీడీపీ ఎలక్షన్‌ కో ఆర్డినేటర్‌గా జంగా

నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట పార్లమెంటు టీడీపీ ఎలక్షన్‌ కో ఆర్డినేటర్‌గా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని నియమిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. రెండుసార్లు గురజాల ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. వైసీపీ బీసీ విభాగం అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌గా కూడా పని చేశారు. వైసీపీతో విభేదించి టీడీపీలో చేరారు. నరసరావుపేట పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాలు గెలిచి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామని జంగా ఈ సందర్భంగా చెప్పారు.