Mahanaadu-Logo-PNG-Large

గుంటూరు టీడీపీలో వరుస చేరికలు

-తూర్పులో వైసీపీకి నాయకుల గుడ్‌ బై
-పెమ్మసాని ఆధ్వర్యంలో 350 మంది చేరిక

గుంటూరు, మహానాడు: గుంటూరులోని తూర్పు నియోజకవర్గం 6, 57 డివిజన్లలోని సుమారు 350 మంది వైసీపీ కార్యకర్తలు శనివారం టీడీపీలో చేరారు. పార్టీలో చేరుతున్న వారిని ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ కండువాలు కప్పి ఆహ్వానించారు. తూర్పు అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్‌ నశీర్‌ అహ్మద్‌ ఆయన వెంట ఉన్నారు. టీడీపీ నాయకులు భరత్‌రెడ్డి, ఆరో డివిజన్‌ కార్పొరేటర్‌ పోతురాజు సమత ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నంబూ రు సుభాని, రావి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.