ఏపీ ఆర్టీఐ కమిషనర్‌గా జర్నలిస్టు రెహానా

– ముగ్గురు ఆర్టీఐ కమిషనర్ల నియామకం

ఏపీలో ముగ్గురిని ఆర్టీఐ కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జరహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో ఎన్‌టివి సీనియర్ రిపోర్టర్ రెహానా, డాక్టర్ ఉదయ్‌భాస్కర్‌రెడ్డి (వైద్యం), సునీల్ (స్పోర్ట్స్) ఉన్నారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వీరు మూడేళ్లు ఆ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులో పేర్కొన్నారు.