బాబూ జగ్జీవన్‌రామ్‌కు కన్నా లక్ష్మీనారాయణ నివాళి

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం రఘురామ్‌ నగర్‌ ప్రజా వేదికలో బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా శుక్రవారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ నివాళులర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషిచేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమర యోధుడు, మాజీ ఉప ప్రధాని అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, దళిత, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు