-సన్న వడ్లకే రూ.500 బోనస్ అంట
-రైతులను మరోసారి మోసగించిన కాంగ్రెస్
-ఎన్నికలయ్యాక నాలుక మడతేశావా రేవంత్
-ముందు చెప్తే తుక్కుతుక్కు చేసేవాళ్లని వ్యాఖ్య
హైదరాబాద్, మహానాడు: కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేయడం, దగా చేయడమేనని కేసీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిరచారు. రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎట్లా ప్రకటిస్తది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు డబ్బాలో పడంగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరింది. అందుకే నాలిక మడతేసి ఎప్పటి మాదిరిగానే నయ వంచనకు పూనుకున్నారు. ఇదే సన్న వడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికలకు ముందు చెప్పి ఉంటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కుతుక్కు చేసే వాళ్లని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలని పిలుపునిచ్చారు. రైతాంగానికి భరో సా కల్పించే దిశగా తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.