Mahanaadu-Logo-PNG-Large

కోమటిరెడ్డి..చెత్త మాటలు ఆపు

మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్‌

హైదరాబాద్‌, మహానాడు : సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం మీట్‌ ది ప్రెస్‌లో మంత్రి కోమటిరెడ్డి తన ఆస్తులపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. కోమటిరెడ్డివి చెత్త మాటలు ప్రజల కు ఉపయోగపడవని మండిపడ్డారు. పొద్దుటి మాటకు, సాయంత్రం మాటకు పొంతన ఉండదన్నారు. రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలపై ఆయన మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలని హిత వుపలికారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చీడ పురుగులు ఉండడం ప్రమాదకరం. నా జీవితం తెరిచిన పుస్తకమని, మూడు తరాల ముందు…తర్వాత కూడా విచారించుకోవచ్చన్నారు. వ్యక్తిగతం గా మాట్లాడితే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.