తెలంగాణ ఆవిర్భావ వేడుకల తర్వాత ఆహ్వానం
పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగా ణ భవన్లో కార్యక్రమాలు ముగిశాక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆదివారం మధ్యాహ్నం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కె.ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, రసమయి బాలకిషన్, ప్రముఖులు గంగుల సుధాకర్, గాలి అనిల్ కుమార్, చల్లా హరిశంకర్, వాసుదేవ రెడ్డి తదితరులతో కలిసి ఆతి థ్యం స్వీకరించారు. వద్దిరాజు కుటుంబసభ్యులు, సన్నిహితులు, సిబ్బంది, పలువు రు నాయకులతో ఫొటోలు దిగారు.