Mahanaadu-Logo-PNG-Large

భువనేశ్వరిని కలిసిన కుప్పం న్యాయవాదుల సంఘం

కుప్పం, మహానాడు :  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సంతోషం వ్యక్తం చేస్తూ కుప్పం న్యాయవాదుల సంఘం ప్రతినిధులు నారా భువనేశ్వరిని కలిసి హర్షం వ్యక్తం చేశారు. కుప్పం పీఈఎస్ గెస్ట్ హౌస్ వద్ద భువనేశ్వరిని న్యాయవాదులు కలిశారు. వైసీపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. సామాన్యుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న చొరవను కొనియాడారు. నిజం గెలవాలి పర్యటనలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తాము ఇచ్చిన వినతికి, నేడు అసెంబ్లీలో ఫలితం కనిపించిందన్నారు.

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు సారథ్యంలో ముందుకు వెళుతుందని భువనేశ్వరి అన్నారు. సామాన్యులకు న్యాయపరమైన సేవలు అందించి సమాజానికి తోడ్పడాలని న్యాయవాదులను కోరారు.