-ప్రజలకు మంచి చేసే వ్యవస్థ కాదు
-ప్రజల ను నియంత్రించడానికి తెచ్చిన చట్టం
-భవిష్యత్లో టైటిల్ ఫ్రూవ్ చేసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడాలి?
– ప్రముఖ జర్నలిస్టు పూల విక్రం ముఖాముఖిలో విశ్రాంత ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్
ఆందోళనతో, బాధతో ట్వీట్ చేశా. కృష్ణా జిల్లా విన్నకోటలో నా తండ్రి పేరు మీద తొమ్మిదిన్నర ఎకరాల భూమి ఉంది. నా తండ్రి చనిపోయే ముందే వీలునామా రాశారు. 30 మంది రైతులు కలిసి చేపల చెరువు ఏర్పాటు చేశారు. నా తండ్రి భూములను మ్యూటేషన్ చేయమని తహసీల్దారు లేఖ రాశా.
తహసీల్దార్ మ్యూటేషన్ ను తిరస్కరించారు. నా భూమిని ప్రత్యక్షంగా చూపించాలని తహసీల్దార్ చెప్పారు. చేపల చెరువుగా మారిన 120 ఎకరాల్లో మా భూమిని ఎలా గుర్తించాలి? విషయాన్ని సీసీఎల్ఏ దృష్టికి తీసుకెళ్లాను. భూమిని మ్యూటేషన్ చేయమని కలెక్టర్కు సీసీఎల్ఏ ఉత్తర్వులు ఇచ్చారు. వీటిని కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కు పంపాను. ఇంతవరకూ స్పందన లేదు.
వివాదంలో ఉంది కనుకే మ్యూటేషన్ జరగలేదనడం అవాస్తవం. మా తండ్రికి చెందిన తొమ్మిదిన్నర ఎకరాలు ఆయన కష్టార్జితం.. దీనికి పట్టా ఉంది. చీఫ్ సెక్రటరీగా పని చేసిన నేను కేవలం మ్యూటేషన్ కే ఇబ్బందిపడుతున్నా. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా బదిలీకే ఇంత ఇబ్బందైతే భవిష్యత్లో పరిస్థితి ఏంటి?
భవిష్యత్లో టైటిల్ ఫ్రూవ్ చేసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడాలి? ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రజలకు మంచి చేసే వ్యవస్థ కాదు. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే చట్టం ఇది. ఇది ప్రజలకు కోసం తెచ్చింది కాదు వారిని నియంత్రించడానికి తెచ్చినట్లు ఉంది