Mahanaadu-Logo-PNG-Large

కూటమిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేద్దాం

దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి
దొనకొండ మండలంలో ప్రచారం

దర్శి, మహానాడు : దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం మల్లంపేట, బాదాపురం, ఎర్రబాలెం గ్రామా లలో శుక్రవారం దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపా రావు, మాజీ ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ ప్రచారం నిర్వహించారు. కరువు రక్కసి విముక్తి కోసం, వలస నివారణ కోసం చంద్రన్నకు ఓటేద్దాం…అభివృద్ధి పథంలో నడుద్దామని పిలుపునిచ్చారు. దొనకొండ మండలం తాగు, సాగునీరు లేక కనీస మౌలిక వసతులకు దూరంగా ఉంది. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు వెలుగొండ నీటి ని రప్పించి తాగు, సాగునీటి కష్టాలు తీరుస్తామని తెలిపారు. దొనకొండను పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.