హైదరాబాద్, మహానాడు : హైదరాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్యాదవ్, మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీపై సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి బీజేపీ అభ్యర్థి మాధవీలత ఫిర్యాదు చేశారు. గడ్డం శ్రీనివాస్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మోదీపై మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కేవలం ఓట్ల కోసం నోటికి వచ్చినట్లు అబద్ధాలు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
ఇస్లామిక్ దేశాల్లో నరకడమే మన లక్ష్యం అన్నట్లుగా కొందరు ఇస్లామిక్ వాదులు అంటున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్న ముస్లిం వాదులకు మద్దతు ఇచ్చే విధంగా ఓవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో వెల్లడిరచారు. పసి పిల్లలను సైతం వదిలిపెట్టకుండా ఓట్ల రాజకీయానికి తెరలేపారని వివరించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.