రాజమండ్రి, మహానాడు : రాజమండ్రిలోని పలు చర్చిలలో ఫాదర్స్ జాన్ వెస్లీ, ప్రతాప్ సిన్హా, టి.జాన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రార్ధనలు నిర్వహించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ అనపర్తి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి కె.ఎస్.జవహర్, ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కుమారుడు దగ్గుబాటి హితేష్ పాల్గొన్నారు.