Mahanaadu-Logo-PNG-Large

జగన్‌ కు నారా లోకేష్‌ హెచ్చరిక

-జగన్‌ ఓడినా రక్తచరిత్ర ఆపలేదు
-హత్యారాజకీయాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు
-వైసీపీ ఫ్యాక్షన్‌ దాడులకు చెక్‌ పెడతాం
-గౌరీనాథ్‌ కుటుంబానికి అండగా ఉంటాం
-నిందితులను వదిలే ప్రసక్తే లేదు

అమరావతి: వైసీపీ దాడులపై, కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్త హత్యపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ స్పందించారు. వైఎస్‌ జగన్‌ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నాడని ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెకి చెందిన టీడీపీ నేత గౌరీనాథ్‌ చౌదరిని దారుణంగా హత్య చేయించారు. వైసీపీ ఫ్యాక్షన్‌ పాలన వద్దని జనం ఛీకొట్టినా, బాబాయ్‌ని చంపినట్టే జనాన్ని చంపుతూ ఉన్నాడు జగన్‌ రెడ్డి. హత్యా రాజకీయాలు ఇకనైనా ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గౌరీనాథ్‌ చౌదరి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని, నిందితులను వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. వైసీపీ ఫ్యాక్షన్‌ దాడులకు చెక్‌ పెడతామని, శాంతిభద్రతలు కాపాడుతామని చెప్పారు.