స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పంపు…నేనూ పంపుతా
రుణమాఫీ, గ్యారంటీలు అమలు చేస్తావో..లేదో చెప్పు
జిల్లాలు కావాలంటే బీఆర్ఎస్కు ఓటేయండి
గులాబీ జెండా ప్రస్తానం దేశానికే ఆదర్శం
పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మాజీమంత్రి హరీష్రావు
సిద్దిపేట, మహానాడు : బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు సిద్దిపేట పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు పార్టీ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 2001 ఏప్రిల్ హైదరాబాద్ జల దృశ్యంతో ప్రారంభ మైన గులాబీ జెండా ప్రస్తానం…నేడు దేశానికి ఆదర్శం అయింది. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. మన పథకాలను కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసింది. రైతు బంధు పథకాన్ని కేంద్రంలో బీజేపీ కాపీ కొట్టి అమలు చేశారు. కేసీఆర్ అభివృద్ధిలో ఆదర్శంగా ఉంటే రేవంత్రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నా రు. తమ ఎమ్మెల్యేలను తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని నేను రాజీనామా చేస్తానన్నా.
రాజీనామా కోసం జిరాక్స్ పేపరు ఇచ్చిన వ్యక్తి రేవంత్రెడ్డి, రాజీనామా అని తప్పించుకుని తిరిగిన వ్యక్తి కిషన్రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తే నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను..సొల్లు కాదు…సీదా మాట్లాడు..సూటిగా మాట్లాడు అని ప్రశ్నించారు. స్పీకర్ ఫార్మాట్లో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డికి రాజీనామా పంపించు, నేను 5 నిమిషాల్లో పంపిస్తాను…నాకు పదవులు ముఖ్యం కాదు రైతు లు, ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని పేర్కొన్నారు. నాడు ఓటుకు నోటు, నేడు దేవుళ్లపైన ఒట్లు…ఆగస్టు 15 లోపు రుణమాఫీ, గ్యారంటీలు అమలు చేస్తావో లేదో చెప్పు రేవంత్.. నేను రుణమాఫీ చేయాలని అడిగితే కాంగ్రెస్ మంత్రులు నన్ను తిడుతున్నారు. మీ తిట్లను ప్రజలు గమనిస్తున్నారు. హామీలు అమలయ్యే వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటా…సిద్దిపేట జిల్లా ను తొలగిస్తానని రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారు..జిల్లాలు ఉండాలంటే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధిచెప్పాలని అన్ని జిల్లాల కేంద్రాల ప్రజలకు పిలుపునిచ్చారు.